ప్రధాన కథనాలు
త్వరలో భారీ కొలువుల మేళా | |
* మూడున్నర వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో 3,498 పోస్టుల భర్తీకి
ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 34,450 ఉద్యోగాల
భర్తీకి మే 23న ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన విషయం విదితమే. వీటిలో
12,072 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. 7,346
పోస్టులను డీఎస్సీ, 14 పోస్టులను ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజి ద్వారా భర్తీ
చేస్తారు. 11,387 పోస్టులను పోలీస్ నియామక సంస్థ, 133 పోస్టులను
యూనివర్శిటీల ద్వారా భర్తీ చేస్తారు.
గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా.. అని ఇప్పటికే లక్షలాది మంది అభ్యర్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది నుంచి భర్తీలకు సంబంధించి క్యాలెండర్ ఇయర్ను అమలుచేయనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు ప్రకటించడం కూడా నిరుద్యోగుల్లో ఆసక్తి రేకెత్తించింది. కేటగిరీల వారీగా పోస్టుల భర్తీ విషయంలో తొందర్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2012 డీఎస్సీలో ఎంపికైన 21 వేల మంది పోను మరో 3.8 లక్షల మంది కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరో లక్షన్నర మంది కూడా కొత్తగా డీఎస్సీ రాసేందుకు సిద్ధమవుతున్నారు. |
No comments:
Post a Comment