Meeseva & Telangana State Online Service/Andhra Pradesh Online Services/ All Govt Recruitmenrs Services
Tuesday, January 22, 2013
1500 ఎస్బీఐ పీవోలకు నోటిఫికేషన్ విడుదల
Sriven's Aponline & Meeseva
Address:Opp.Amberpet Police Station, Amberpet, Hyderabad,A.P,India
Online Application Available here
1500 ఎస్బీఐ పీవోలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టుల భర్తీకి జనవరి 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ఎస్సీలకు 225, ఎస్టీలకు 112, ఓబీసీలకు 405, జనరల్ అభ్యర్థులకు 758 కేటాయించారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని ఎస్బీఐ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల వయసు 2013 జనవరి 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలని, ఇతరులకు నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఇస్తారని పేర్కొంది. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో సాగుతుంది. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అర్హత సాధించిన వారికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలో కూడా అర్హత సాధిస్తే తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్లో జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 30తో మొదలై ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. రాత పరీక్షను ఏప్రిల్ 28న నిర్వహిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment